మార్కెట్ రేసులో దూసుకుపోతున్న అదానీ పవర్!
- దేశంలో 11వ అత్యంత విలువైన సంస్థగా అవతరణ
- అదానీ పవర్ మార్కెట్ క్యాప్ రూ. 4.85 లక్షల కోట్లు
- ఎండల తీవ్రతతో విద్యుత్ షేర్లకు పెరిగిన డిమాండ్
- ఏఐ ముప్పుతో కుప్పకూలుతున్న ఐటీ రంగ షేర్లు
- ఈ ఏడాది 29 శాతం నష్టపోయిన ఇన్ఫోసిస్
భారత స్టాక్ మార్కెట్లో అదానీ గ్రూప్నకు చెందిన ‘అదానీ పవర్’ సరికొత్త మైలురాయిని అందుకుంది. దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ను వెనక్కి నెట్టి అత్యంత విలువైన కంపెనీల జాబితాలో ముందుకు దూసుకెళ్లింది. ఈ ఏడాది ఇప్పటివరకు షేర్ల ధర ఏకంగా 68 శాతం మేర పెరగడంతో మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా అదానీ పవర్ ఈ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది.
దేశంలో 11వ స్థానానికి
నేటి ట్రేడింగ్లో అదానీ పవర్ షేరు దాదాపు 3 శాతం లాభపడి రూ.252 వద్ద సరికొత్త 52 వారాల గరిష్ఠాన్ని తాకింది. ఈ భారీ పెరుగుదలతో కంపెనీ మొత్తం మార్కెట్ విలువ సుమారు రూ.4.85 లక్షల కోట్లకు చేరింది. అదే సమయంలో ఇన్ఫోసిస్ మార్కెట్ విలువ రూ.4.72 లక్షల కోట్ల వద్దే నిలిచిపోయింది. దీంతో దేశంలోనే అత్యంత విలువైన కంపెనీల జాబితాలో అదానీ పవర్ 11వ స్థానానికి ఎగబాకింది.
ఎల్నినో ఎఫెక్ట్
దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలు అదానీ పవర్ షేర్లకు కలిసొచ్చాయి. ఎల్నినో ప్రభావం వల్ల తీవ్రమైన ఎండలు ముదరడంతో విద్యుత్ వినియోగం పెరిగింది. మే 22 నాటి గణాంకాల ప్రకారం.. ప్రపంచంలోని అత్యధిక ఉష్ణోగ్రత్తలు నమోదైన 100 నగరాల్లో 97 భారతదేశంలోనే ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలో విద్యుత్ కంపెనీల షేర్లకు స్టాక్ మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఏర్పడింది.
ఐటీ రంగంలో సంక్షోభం
పవర్ రంగానికి డిమాండ్ పెరిగితే ఐటీ రంగానికి మాత్రం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ముప్పుగా మారింది. ‘ఆంథ్రోపిక్’ అనే ఏఐ స్టార్టప్ తెచ్చిన సరికొత్త క్లాడ్ కోవర్క్ ఏజెంట్ వల్ల సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగాలు, మార్కెట్ దెబ్బతినే అవకాశం ఉందనే భయాలు మొదలయ్యాయి. ఫలితంగా ఈ ఏడాది ఇన్ఫోసిస్ షేర్లు ఏకంగా 29 శాతం మేర పతనమయ్యాయి.
దేశంలో 11వ స్థానానికి
నేటి ట్రేడింగ్లో అదానీ పవర్ షేరు దాదాపు 3 శాతం లాభపడి రూ.252 వద్ద సరికొత్త 52 వారాల గరిష్ఠాన్ని తాకింది. ఈ భారీ పెరుగుదలతో కంపెనీ మొత్తం మార్కెట్ విలువ సుమారు రూ.4.85 లక్షల కోట్లకు చేరింది. అదే సమయంలో ఇన్ఫోసిస్ మార్కెట్ విలువ రూ.4.72 లక్షల కోట్ల వద్దే నిలిచిపోయింది. దీంతో దేశంలోనే అత్యంత విలువైన కంపెనీల జాబితాలో అదానీ పవర్ 11వ స్థానానికి ఎగబాకింది.
ఎల్నినో ఎఫెక్ట్
దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలు అదానీ పవర్ షేర్లకు కలిసొచ్చాయి. ఎల్నినో ప్రభావం వల్ల తీవ్రమైన ఎండలు ముదరడంతో విద్యుత్ వినియోగం పెరిగింది. మే 22 నాటి గణాంకాల ప్రకారం.. ప్రపంచంలోని అత్యధిక ఉష్ణోగ్రత్తలు నమోదైన 100 నగరాల్లో 97 భారతదేశంలోనే ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలో విద్యుత్ కంపెనీల షేర్లకు స్టాక్ మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఏర్పడింది.
ఐటీ రంగంలో సంక్షోభం
పవర్ రంగానికి డిమాండ్ పెరిగితే ఐటీ రంగానికి మాత్రం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ముప్పుగా మారింది. ‘ఆంథ్రోపిక్’ అనే ఏఐ స్టార్టప్ తెచ్చిన సరికొత్త క్లాడ్ కోవర్క్ ఏజెంట్ వల్ల సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగాలు, మార్కెట్ దెబ్బతినే అవకాశం ఉందనే భయాలు మొదలయ్యాయి. ఫలితంగా ఈ ఏడాది ఇన్ఫోసిస్ షేర్లు ఏకంగా 29 శాతం మేర పతనమయ్యాయి.